జనసైనికుల సంక్షేమమే జనసేన అధినేత ధ్యేయం : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

     విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ చరిత్రలోనే కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించి పార్టీ క్రియాశీలక సభ్యులకు జీవిత భీమా సౌకర్యాన్ని కల్పించారని, ఈ అవకాశాన్ని ప్రతీ జనసైనుకులు, వీరమహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం ఐదు వందల రూపాయలు పెట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నచో ఐదు లక్షలు జీవిత భీమా, అలాగే ఏభైవేలు వరకు హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం ప్రమాదభీమాను పార్టీ కల్పిస్తుందని అన్నారు. విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆదేశాలు మేరకు ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ శిబిరానికి మంచి స్పందన లభించిందని, ఇదేస్ఫూర్తితో మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. పలువురు సభ్యత్వాలు తీసుకున్న ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు మజ్జి శివశంకర్, డాక్టర్ మురళి మోహన్, చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, అబ్బు, సత్యనారాయణ, రాంబాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way