విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, వైద్యులకు, యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు

        మంచి సమాజం కోసం వరుసగా మూడో రోజు  స్థానిక టెక్కలి ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో కరోనా బాధిత కుటుంబాలకు మరియు వైద్య సిబ్బందికి ఆహార పొట్లాలు అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాక్షికంగా లాక్ డౌన్ నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో యాచకులకు కూడా ఆహార పోట్లాలు అందించారు. జనసేన నాయకులు  అట్టాడ శ్రీధర్ మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మన జనసైనికులు వీరమహిళలు కలిసికట్టుగా ఉంటూ దగ్గరలో కోవిడ్  బారిన పడిన కుటుంబాలని ఆదుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ తరుపున జనసేవ కార్యక్రమం ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన యాదవ్, అట్టడా శ్రీధర్రాం,  ప్రసాద్ గారు, రాయ సునీల్, పసుపురెడ్డి సోమేశ్, హనుమంతు దిలీప్, కొమ్ము అరుణ్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.