భారత దేశం ఉప ప్రధాని స్వతంత్ర సమర యోధుడు సమాజ నిర్మాత బాబు జగ్జీవన్ రామ్ గారి 35 వ వర్ధంతిని కొండపల్లి బీ కాలనీ సెంటర్లో వున్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కల గాంధీ గారు మాట్లాడుతూ, గాంధీజీ చేత అమూల్య భారత రత్నగా పిలువబడే బాబు జగ్జీవన్ రామ్ సామాజిక వివక్ష, అసమానతలు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య, సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం కృషిచేశారని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా ఆదర్శ జీవితం గడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కరణోద్యమనేత బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనా పార్టీ నేతలు బొలియా శెట్టి శ్రీకాంత్, యర్రం శెట్టి నాని, అశోక్ బాబీ, వంశీ ప్రవీణ్, పార్థు, సురేష్, రామంజి, చరణ్ ప్రవీణ్, కార్యకర్తలు తదితురులు పాల్గొన్నారు.
