ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

     శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని వరి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జనసేన పార్టీ తరపున ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు రైతులుతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడంతో, ఆ ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం లేక అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలే శరణ్యంగా యోచనలో ఉన్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకటరమణ, అప్పలనాయుడు, రామారావు, నాయుడు, సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ అభ్యర్ధి పైడి.మురళీ మోహన్ మండల నాయకులు ధనుంజయ్, వాసు, నాగరాజు, రమణ, శ్రీధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way