జనసేన నాయకుడు పల్నాటి సాగర్ జన్మదినోత్సవం సందర్భంగా వయోవృద్ధులకు దుప్పట్లు పంపిణీ

జనసేన నాయకుడు పల్నాటి సాగర్ జన్మదినోత్సవం సందర్భంగా వయోవృద్ధులకు దుప్పట్లు పంపిణీ

               దెందులూరు నియోజకవర్గం జనసేన నాయకుడు పల్నాటి సాగర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు.  వెంపాడు విలేజ్ కోఆర్డినేటర్ బెజవాడ లక్ష్మణ్ మరియు వెంపాడు – కొక్కిరపాడు జన సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేసి మిఠాయిలు పంచడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ  నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు కోటగిరి వెంకట సుధాకర్ , జనసేన వీరమహిళ మెంటే సౌజన్య గారు, దుర్గ వేమిరెడ్డి ( విలేజ్ కోఆర్డినేటర్, గండి చెరువు గట్టు ), రాజేశ్ ( విలేజ్ కోఆర్డినేటర్, సత్యవోలు) మరియు దెందులూరు నియోజక వర్గం జన సైనికులు పాల్గొన్నారు.