ఎమ్మెల్యే కన్నబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు

     రైల్వేకోడూరు, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రెండవ విడత కౌలు రైతుల భరోసాయాత్రపై రాష్ట్ర మాజీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని రైల్వేకోడూరు జనసేనపార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు స్పష్టం చేశారు. కౌలు రైతుల అకాల మరణం తీవ్ర బాధాకరమైన విషయమని ఆ రైతు కుటుంబాల తాత్కాలిక సంతోషం కోసం ఒక భరోసా కల్పించే నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షులు పశ్చిమగోదావరి జిల్లాలో ఏప్రిల్ 23వ తేదీన కౌలు రైతు భరోసా యాత్రలు ప్రారంభిస్తున్న సందర్భంగా రైతులు సంతోషంగా ఉన్నారని కన్నబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులంతా సంతోషంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదు. మేము చేస్తేనే రాజకీయం అనడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు కలిపి ఇచ్చే 30 వేల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఇచ్చే 37500 కలిపి చూపించడం హాస్యాస్పదం అన్నారు. మీ ప్రభుత్వ పాలనలో కౌలు రైతులు ఆనందంగా ఉండుంటే మరి మా సొంత నిధులు ఖర్చు చేస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇంత బాధ అని విమర్శించారు. రైతులకు న్యాయంగా వైసిపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కౌలు రైతుల అకాల మరణం వారి కుటుంబానికి తీవ్ర ఆవేదన కలిగించకుండా వారికి రావాల్సిన తక్షణ సహాయమును ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way