ఆచంటలో పెళ్లి వేడుకలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

          ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం, వడలి గ్రామంలో జనసేనపార్టీ మండల అధ్యక్షులు కంబాల బాబులు  ఆధ్వర్యంలో వడ్డి వారి పెళ్లి వేడుకల్లో వదువరులచే జనసేన రైతు భరోసా యాత్ర టీం పిడికిలి పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. 30 కోట్లతో 3000మంది కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారి టీమ్ పిడికిలి పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్, జనసేన జిల్లా ప్రోగ్రామీ కమిటీ సభ్యులు తోట సురేంద్ర, సిదాంతం జనసేనపార్టీ గ్రామ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, జనసేన సీనియర్ నాయకులు దార్లంక మారుతి మొదలగువారు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook