Search
Close this search box.
Search
Close this search box.

కరోనాతో బాధపడుతున్న కుటుంబానికి సహాయం చేసిన జనసేన వీరమహిళలు

           తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువు నందు ఆర్థికంగా వెనుకబడిన ఒక కుటుంబం కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన వీర మహిళ బొలిశెట్టి వెంకట లక్ష్మీ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ దృష్టి కి తీసుకువెళ్లగా ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి సూచనలు మేరకు జనసేన వీర మహిళ బొలిశెట్టి వెంకట లక్ష్మీ తన తోటి వీర మహిళల కొలిశెట్టి పుష్ప, తూరంగి లక్ష్మితో కలిసి తన వంతు సహాయంగా ఆ కుటుంబానికి రైస్ బ్యాగ్ మరియు కూరగాయలు అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి శేషుకుమారి గారు మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మన జనసైనికులు వీరమహిళలు కలిసికట్టుగా ఉంటూ దగ్గరలో కోవిడ్  బారిన పడిన కుటుంబాలని ఆదుకోవాలని నా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అభినందిస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way