రామచంద్రపురంలో విజయవంతంగా కొనసాగుతున్న జనసేన క్రీయాశీలక సభ్యత్వాలు

రామచంద్రపురంలో విజయవంతంగా కొనసాగుతున్న జనసేన క్రీయాశీలక సభ్యత్వాలు

                         రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణము 3 వ వార్డు అంకంవారి వీది జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అంకం శ్రీనివాసరావు గారు మరియు రవణ గారి సమక్షంలో రామచంద్రపురం పట్టణములో మొదటి సారిగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంబించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయుంచుకోవలసిందిగా దీని వలన క్రియాశీలక కార్యకర్తలకు భీమా రూ.5,00,000 మరియు, ఎక్కడ ప్రమాదం చోటుచేసుకున్న రూ.50,000 రూపాయల భీమాను వర్తింపజేయడం జరుగుతుందని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు చల్లాబుజ్జి, విల్లా కార్తీక్, అల్లం నాగు, విల్లా సురేష్, దున్నే గణేష్, మాడెం పండు, మామిడి సాయి, దుళ్ల చంటి, మణీంద్ర, రాంబాబు నాయుడు మరియు తదితర 3 వ వార్డు జనసైనికులు పాల్గొనడం జరిగింది..