గాజువాక 65వ వార్డ్ లో శ్మశాన వాటిక లో(స్వచ్ఛభారత్) శ్రమదానం లో పాల్గొన్న జనసైనికులు

గాజువాక 65వ వార్డ్ లో శ్మశాన వాటిక లో(స్వచ్ఛభారత్) శ్రమదానం లో పాల్గొన్న జనసైనికులు

        గాజువాక నియోజకవర్గం 65 వ వార్డులో సుమారు పరిసర ప్రాంతల అన్నింటికి ఒక్కటే శ్మశాన వాటిక. కానీ, నేటికీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. విషయం తెలుసుకున్న 65 వ వార్డు జనసేన బీజేపీ కార్పొరేట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రెయ్యి రత్న గారు ఈరోజు వార్డు జనసైనికులతో శ్మశాన వాటికలో ఉన్న శివుడు చుట్టు పేరుకుపోయిన పిచ్చిమొక్కలు అన్నింటిని పరిశుభ్రం చేయించడం జరిగింది.  అనంతరం రెయ్యి రత్న గారు మాట్లాడుతూ జీవీఎంసీ వారికి కూడా శ్మశాన వాటికను అభివృద్ధి నిధులు విడుదల చేయాలని గత వారంలో జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ శ్రమదానం కార్యక్రమంలో జనసైనికులు మజ్జి వాసు, బద్రి, గోవింద్, నవీన్, మహేష్, సాయి, నవీన్, అనిల్, యస్వంత్, దిల్లీప్, జైకుమార్, కార్తీక్, సురేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.