అన్నమయ్య ప్రాజెక్ట్ దిగువ ప్రాంతాల్లో పర్యటించిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్

అన్నమయ్య

      రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య ప్రాజెక్ట్ వరద బాధిత ప్రాంతాల్లో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, స్థానికులతో కలిసి అక్కడ ప్రాంతాల్లో పర్యటించి ఆయన మాట్లాడుతూ వరద తాకిడికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో దెబ్బతిని ప్రమాదానికి గురై 2 సంవత్సరాల కాలం కావస్తోంది. అప్పట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 నెలల్లోనే ప్రభుత్వం తరపున వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక నెలలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి భాదితులకు నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చి నెల రోజులు పూర్తి అవ్విపోయి 2వ నెల జరుగుతున్న అరకొర ఇళ్ళ నిర్మాణ పనులు చేస్తూ ప్రజలకు మాయ మాటలు చెప్తూ, పబ్లిసిటీ పెంచుకుంటున్నారు తప్ప అక్కడ పనులు అంతంత మాత్రమే జరుగుతున్నాయి అని అన్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వెంటనే అన్ని రకాలుగా అక్కడి ప్రాంత ప్రజలను ఆదుకోవాలని జనసేనపార్టీ తరపున రామ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way