Search
Close this search box.
Search
Close this search box.

మానసికంగా కృంగిపోయిన అమ్మాయికి చికిత్స కొరకు ఆర్థిక సాయం అందజేసిన జనసేన నాయకులు

చికిత్స

     పామిడి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో పామిడి పట్టణానికి చెందిన షేక్ సోనీ తల్లితండ్రులను కోల్పోయి మానసికంగా కృంగిపోయి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యింది. నేడు ఆమె చికిత్స నిమిత్తము సుమారు లక్ష రూపాయలు అవుతుందన్న విషయాన్ని తెలుసుకున్న పామిడి మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఆ అమ్మాయి పరిస్థితిని చూసి చలించిపోయారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఎప్పుడూ అభిమానులకు చెపుతుంటారో కష్టాల్లో ఉన్నవారికి మన వంతు భరోసాగా నిలబడుదాం, ఆపదలో ఉన్నవారికి మన వంతు ఆపన్న హస్తాన్ని అందిద్దాం అన్న నాయకుడి మాటలను స్ఫూర్తిగా తీసుకొని తమ వంతు బాధ్యతగా అందరూ డబ్బును జమ చేసి సుమారు11,710/- రూపాయలు ఆ చిట్టి తల్లి చేతికే ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి జనసేన పార్టీ నాయకులను చూసి పవన్ కళ్యాణ్ బొమ్మ ఉన్న కండువా నాకు కావాలి నేను వేసుకుంటా అంటూ మా మెడలోని కండువాని తీసుకొని తను తన మెడలో వేసుకొని మానసికంగా తను సరిగా లేకున్నా పవన్ కళ్యాణ్ బొమ్మను చూస్తూ ఆనందపడిన వైనన్ని చూస్తే మాకెంతో సంతోషం అనిపించిందని అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆ అమ్మాయికి అమితమైన ఇష్టం అన్నది అర్థమైందన్నారు. ఆ అమ్మాయి చికిత్స చేయించుకొని త్వరగా పూర్తి ఆయురారోగ్యాలతో అందరి అమ్మాయిల్లాగా తన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way