బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు

బొలిశెట్టి శ్రీనివాస్

       తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో వైసీపీ నుంచి జనసేనలోకి మంగళవారం నీలపల దినేష్ మరియు అడపా ప్రసాద్ అధ్యక్షతనలో భారీ చేరికలు జరిగాయి. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతులమీదుగా వైసీపీ ఎంపీటీసీ, వార్డు నెంబర్, మరియు సీనియర్ నాయకులు,వారి అనుచరులు 50 మందికి పైగా జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీలో మొదటి నుండి ఉంటున్న వాళ్లకు అన్యాయం జరుగుతుందనీ పార్టీ కోసం కష్టపడిన వారిని వైసీపీ చిన్న చూపు చూస్తుందని, ఈ నాలుగున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వంతో తీవ్ర నష్టాలలో మిగిలిపోయిందనీ ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాటం చూసే జనసేనలోకి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా కొట్టు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తాడేపల్లిగూడెం పట్టణానికి మరియు గ్రామాలకి వైసీపీ ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులు చేసింది ఏమీ లేదని, రోడ్ల పరిస్థితి, ఇసుక దోపిడి, “కే”టాక్స్, వంటివి ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని వివరించారు. ఈ కార్యక్రమంలో నీలపాల వీరాస్వామి, అయినపర్తి శ్రీనివాస్, మరిడి కృష్ణారావు, నీలపాల సత్యనారాయణ, మువ్వ శ్రీను, అడ్డాల శివ, నీలపాల గణేష్, బూర్ల భవాని, వెంపల సాయి, అడపా గంగాధర్, మణికొండ కిరణ్ మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way