బొత్స సత్య నియోజకవర్గంలో గ్రంథాలయ నిర్మాణానికి నోచుకోని వైనం

    చీపురుపల్లి ( జనస్వరం ) :చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ పరీక్షలకి, గ్రూప్ -2 కి చదివే విద్యార్థులు వందలాది మంది ఉన్నప్పటికీ అదే నియోజకవర్గం నుండి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కనీసం లైబ్రరీ సదుపాయం కల్పించలేకపోవడం దురదృష్టకరం అని జనసేన నాయకులు అన్నారు. చివరికి విద్యార్థులే ఉన్న చిన్న గదిని వర్షం పడితే నీరు కారేసిన గది పైకప్పు పైన విద్యార్థులే సొంత డబ్బులతో పరదా వేసుకోనే దుస్థితి ఏర్పడింది అన్నారు. చివరికి లైబ్రరీలో కనీసం అవసరమైన పుస్తకాలు కూడా లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం దురదృష్టకరం. దీని మీద చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు లైబ్రరీని పరిశీలించి జనసేన – టిడిపి అదికారంలో వచ్చిన తర్వాత లైబ్రరీ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. మరియు గ్రంథాలయ కార్యదర్శికి పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  గరివిడి మండల అధ్యక్షులు పెద్ది వెంకటేశ్, ఉత్తరాంధ్ర జోన్ కమిటీ సభ్యులు బోడసింగి రామకృష్ణ, కార్యనిర్వాహన నిర్వహణ కార్యదర్శి దన్నన యేసు, చందక బాలకృష్ణ, బాకురి శ్రీను, గిడిజాల చిరంజీవి, పల్లి కూమార్, గొర్ల రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way