Search
Close this search box.
Search
Close this search box.

అస్వస్థకు గురైన రైతు కూలీలను పరామర్శించిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

గాదె వెంకటేశ్వరరావు

           పొన్నూరు ( జనస్వరం ) : పెడకాకని మండలం, ఉప్పలపాడు గ్రామంలో పొలం పనికి వచ్చిన వ్యవసాయ కూలీలు పొలములో గుళికలు మందులు చల్లుతూ ఉన్న సందర్భంలో ఆ మందుల ప్రభావంతో 20 మంది రైతు కూలిలు అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు హుటాహుటిన వారి గురుంచి పూర్తి సమాచారం మండల అధ్యక్షులు వీరేళ్ల వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకొని వెంటనే కొత్తపేటలో ఉన్న శ్రావణి హాస్పిటల్ కి వెళ్లి ఆ ప్రమాదానికి గురైన రైతు కూలీలను, వారి కుటుంబ అభ్యులను కలిసి వారిని పరామర్శించడం జరిగింది. అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి డాక్టర్ని సంప్రదించి వారికి పూర్తి వైద్యం అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖా బాలు, త్రినాథ్, సతీష్, మధు లాల్, తుమ్మల నరసింహారావు, పల్లెంపాటి‌ రమేష్, విన్నకోట సుబ్రహ్మణ్యం, యాలం రమేష్, సోమిశెట్టి పాండు, మహేష్, సూరి, గంగిశెట్టి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way