రక్తపుమడుగులో ఉన్న తల్లి బిడ్డను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ

        గుడివాడ ( జనస్వరం ) :  కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక బొమ్ములూరు రోడ్డలో ఒక తల్లి కాలు విరిగి తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడటంతో అటుగా వెళ్తున్న ప్రజలు మరియు వాహనదారులు ఎవరూ పట్టించుకోలేదు. ఒక మహిళ పరిస్థితిని చూసి 108 మరియు 100 కాల్ చేసిన సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో గుడివాడ పట్టణం జనసేన సైనికులుకి సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకుని వెళ్లి చికిత్స చేపించి ప్రాణాలు కాపాడడం జరిగింది.  ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ రెండు గంటల నుంచి తల్లి రక్తపుమడుగులో ఉండి చిన్న బిడ్డ ఏడుస్తున్న ఎవరూ పట్టించుకోలేదని మానవత్వం మంటగలిసి పోతుందని ఒక కాకికి చిన్న ఇబ్బంది వస్తానే పది కాకులు కావు కావు అని అరుస్తూ ఉంటాయన్నారు.  మరి మనం మనుషులం అయ్యి ఉండి మానవత్వని మంట కలుపుతున్నామని దయచేసి మానవత్వాన్ని బ్రతికించండి అని మానవ సేవే మాధవ సేవ అని తెలియజేశారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బందికి, పోలీస్ వారికి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, జగదీష్, మెకానిక్ మూర్తి గారు, పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way