Search
Close this search box.
Search
Close this search box.

ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా బాధను మాత్రం ఎవరూ తీర్చడం లేదు

ప్రభుత్వాలు

    ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 62వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా బాధలు మాత్రం తీరటం లేదని ఇప్పటివరకు అనేకమందికి అవకాశం ఇచ్చామని అన్నారు. దోమల మందు కూడా కొట్టేవారు లేరని అలాంటివి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అనీ అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఇప్పటివరకు మన ప్రాంతంలో అనేక సమస్యలను గుర్తించామని రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, ఉంగరాల వాసు, యాదల సుధీర్, సాయి, రవీంద్ర, భరత్, తాటిపత్రి జాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way