Search
Close this search box.
Search
Close this search box.

తక్షణమే గొల్లాది వంతెన నిర్మించాలి : బొబ్బిలి జనసేన నాయకులు

     బొబ్బిలి, (జనస్వరం) : బొబ్బిలి నియోజకవర్గంలో బాడంగి మండలంలో గొల్లాది గ్రామంలో తక్షణమే బ్రిడ్జి నిర్మించాలని జనసేన పార్టీ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ గిరాడ అప్పలస్వామి మాట్లాడుతూ గత వారం రోజులుగా బ్రిడ్జి నిర్మాణం కొరకు అన్ని మీడియాల్లో వెల్లడిస్తూ తక్షణమే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. ఈ నదిపై బ్రిడ్జి లేకపోవడం వల్ల 12 గ్రామాల ప్రజలు పెద్దవాళ్లు, స్కూల్ కి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే కూలీలు, పొలానికి వెళ్ళే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు గతంలో 7,90,000,00 కోట్ల రూపాయలు ఆమోదించారు. గత ప్రభుత్వములో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నిర్లక్ష్యం వహించారు. ఈసారి ఈ ysrcp ప్రభుత్వం అయినా సరే తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతున్నామని తెలిపారు. నియోజకవర్గం నాయకులు గంగాధర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గోల్లాది గ్రామంలో మీరు నిర్మించబోయే గడపగడపకు ప్రోగామ్ లో గ్రామ ప్రజలు నిలదీయడానికి రెడీగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బాడ్ంగిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు గొల్లది బ్రిడ్జి నిర్మాణం తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మూడుసంవత్సరాలు గడిచినా ఇంకా దానిమీద చలనం లేదని వాపోయారు. కావున తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేయాలని మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని మీకు గుర్తు చేస్తూ ఈరోజు మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంచనా గంగాధర్, దివ్య, లంక రమేష్, అడబాల నాగు, బుడి రాజా, పల్లెం రాజా, పొట్నూరు జనార్ధన్, పైల హరి, పిట్టల కిరణ్, చంద్రమౌళి, శివ, సత్య జన సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way