వేసవి తాపం నుండి ఉపశమనం పొందండి : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

     విజయనగరం, (జనస్వరం) : ఒక్కసారిగా రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరగడంతో, విజయనగరంలో 42వ డివిజన్, కామాక్షినగర్లో మజ్జిగ చలివేంద్రాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విపత్తుల శాఖ ఈ నెలాఖరువరకు ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించటంతో ప్రజలందరూ బయటకు వచ్చేటప్పుడు వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఎక్కువగా మంచినీటితో పాటు, మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మరసం వంటి పానీయాలు తాగి వేసవినుంచి ఉపశమనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవిరాజ్ చౌదరి, ఎర్నాగుల చక్రవర్తి, 42వ డివిజన్ నాయకులు, వై. నల్లమరాజు, కనితి సురేష్, అప్పలనాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way