నందలూరు గ్రామ వాలంటీరీకి జనసేనపార్టీ తరుపున ఆర్థిక సాయం

               జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కువైట్ వారు నిర్వహిస్తున్న 30 రోజులు 30 కార్యక్రమాలలో భాగంగా నందలూరులో వాలంటీర్ కు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇటీవల ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు నిమిత్తం జాతీయ జెండాతో పాటు సామగ్రిని తీసుకొని వస్తూ  దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైన గ్రామ వాలంటీర్ మల్లెం హరిరాయల్. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీలో గ్రామ వాలంటీరీగా పనిచేస్తున్న మల్లెం హరిరాయల్ కు తన మిత్రుడు జనసేన పార్టీ కువైట్ సభ్యుడు కొట్టే శ్రీహరి మరియు కువైట్ జనసేన సభ్యులు యం.సురేష్, పుల్లంపేట శివ రూ.20,000 అర్థిక సాయం చేశారు. జనసేన పొందుతున్న మల్లెం హరిని పరామర్శించి బాధిత కుంటుంబ సభ్యులకు జనసేన పార్టీ కువైట్ ఇచ్చిన సాయన్ని అందజేయడం జరిగింది.