ఫించన్ రాని అవ్వతాతలకు జనసేనపార్టీ తరుపున ప్రతి నెలా పెన్షన్ అందజేత

పెన్షన్

            జనస్వరం ( అనంతపురం ) : కదిరి నియోజకవర్గంలో బాలసముద్రం పంచాయితీలో కొంతమంది వృద్ధులకు పెన్షన్ రావట్లేదాని జనసేన పార్టీ తరుపున గెలిచిన ఎం‌పి‌టి‌సి అమర్ కార్తీకేయ దృష్టికి వచ్చింది. కార్తీకేయ పంచాయితీలో పరిధిలో పర్యటించి పెన్షన్ రాని వృద్ధులను గుర్తించారు. వారికి పెన్షన్ రావట్లేదాని సచివాలయంలో అధికారులను ఆరా తీశారు. అధికారులు వివిధ కారణాలు చెప్పి మభ్యపెట్టారు. ఆయన మాట్లాడుతూ ఆ వృద్ధులకు పెన్షన్ నేనే ప్రతి నెలా నెలా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలాగైనా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని అధికారులను హెచ్చరించారు. జనసేన పార్టీ గెలిస్తే న్యాయం చేస్తామని, ఓడిపోతే సహాయం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మా వంతుగా ఆ వృద్ధులకు కాస్తా ఊరటనిచ్చేలా నెలకు 310/- రూపాయలు జనసేన పార్టీ తరుపున పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. జగన్ పాదయాత్రలో అవ్వతాతలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తీరా వారిని మోసం చేస్తున్నారు. అన్నీ అర్హతలు ఉన్నా వారికి పెన్షన్ అందడం లేదని త్వరలోనే అధికారులను కలసి వారికి పెన్షన్ వచ్చేలా పోరాడతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way