Search
Close this search box.
Search
Close this search box.

పేదలపై విద్యుత్ భారాలు తగ్గించాలి

       శింగనమల ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బొమ్మల పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి నిలువునా కరెంటు కోతలతో 2 గంటలు లేక 4 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోందని అన్నారు. జగన్ రెడ్డి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ను విమర్శించడం, మీరు మీ మంత్రులు రైతులకు పగలు ఇస్తామన్న రైతులకు 9 గంటల కరెంటు లేదని అన్నారు. ఇప్పుడు రైతులకు పంట చేతికి వచ్చే టైం కావున రైతుల ఉసురు మీకు తగిలి మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. శీతాకాలము వచ్చినా వేసవి తలపించే గృహ విద్యుత్ బిల్లులుభారీగా వస్తున్నాయని ప్రతినెల చార్జీలు విపరీతంగా పెంచి రాష్ట ప్రభుత్వం సామాన్యులపై పెనుభారము మోపుతున్నారని అన్నారు. కావున తక్షణమే పెంచినచార్జీలు తగ్గించాలి. ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు ఇతర భారాలు రద్దు చేయాలన్నారు. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలి. ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ వరకు ఉచితంగా ఇవ్వాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  విద్యుత్ సవరణ బిల్లు – 2022ను ఉపసంహరించుకోవాలని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way