అధైర్యపడకండి..అండగా ఉంటాం – అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబానికి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్

          విజయవాడ, (జనస్వరం) : కొంతకాలంగా అనారోగ్యా సమస్యలతో ఇబ్బంది పడుతూ  జనసేన కార్యకర్త పడాల సురేష్ (ఏసు) గారు ఆదివారం మృతి  చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు అక్కడికి చేరికొని మృతదేహానికి నివాళులార్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడకండి.. అండగా ఉంటామని మృతుని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవీన్, మదన్, పోలవరపు దుర్గారావు (పెద్దోడు), వేపకాయల చిరంజీవి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.