Search
Close this search box.
Search
Close this search box.

రక్తదానం చేయడం మనందరి సామాజిక బాధ్యత

రక్తదానం

           గుంతకల్ ( జనస్వరం ) : మెగా సేవాసుసంపన్నుడు “పద్మభూషణ్” మెగాస్టార్ డాక్టర్ శ్రీ “కొణిదెల చిరంజీవి” గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా గుంతకల్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో పాండు కుమార్, పవర్ శేఖర్ అధ్యక్షతన గోపి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో “మెగా రక్తదాన శిబిరం” జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, రెడ్ డ్రాప్ రెహమాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ రక్తదానం చేయడాన్ని ఒక మహా యజ్ఞంగా భావించి రక్తదానం చేయడంలో ఎందరినో చైతన్యవంతుల్ని చేసిన స్ఫూర్తి ప్రదాత చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మెగా అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు ఎంతో ఉత్సాహంతో 70 మందికి పైగా రక్తదానం చేసి నవజీవన స్ఫూర్తి దాతలుగా నిలవడం ఎంతో గర్వకారణమని రక్తదాతల సేవ స్ఫూర్తిని కొనియాడారు. రక్తం ఉత్పత్తి చేసే వస్తువు కాదని, మానవ శరీరంలో సహజంగా తయారవుతుందని, అందుకే రక్తాన్ని రక్తదానం వల్లనే మరొకరికి అందివ్వగలమని, రక్త దానం చేయడం కొద్ది నిమిషాల పని, ఇది మరొకరికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కురుబ పురుషోత్తం కాపు సంక్షేమ సేన నాయకులు బుర్ర అఖిల్ రాయల్, కసాపురం వంశీ సీనియర్ నాయకులు పామయ్య, ఆటో రామకృష్ణ, అమర్, అనిల్ కుమార్, సూర్యనారాయణ, చికెన్ మధు, మహేష్, ఐఓసీ శేఖర్, శ్రీనివాసులు, రామకృష్ణ, బర్మశాల శీను, మనోజ్, చంద్ర, వెంకటేష్, శివ, బాబు, మెకానిక్ బాలు, బద్రి, యశ్వంత్, అరవింద్, అల్లు రవి, అల్లు సాయి, శివ కుమార్ హరీష్ మెగా అభిమానులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way