విజయవాడ 51వ డివిజన్ జనసేనపార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మజ్జిగ పంపిణీ

    విజయవాడ, (జనస్వరం) : స్థానిక 51వ డివిజన్లో పి.దుర్గ రావు, గురువు మదన్ కుమార్ అధ్వర్యంలో పండ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, వచ్చిన తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదే విధంగా జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఒక్క అవకాశం అంటూ అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం నిత్యావసర ధరలను ఇష్టానుసారం పెంచేసి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తు రాక్షస పాలన సాగిస్తున్నారని అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ ను అనుసరిస్తూ నియోజకవర్గం సమస్యలను గాలికి వదిలేసి ఇంట్లోంచి బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ నాయకత్వం బలపడుతుందని 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం తథ్యం అని వారన్నారు. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లంశెట్టి రాజు, పులిచేరి రమేష్, సత్తి, దుర్గారావు, మణికంఠ, సాయి తదితరులు పాల్గొన్నారు.