మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి చర్చా కార్యక్రమాలు

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి చర్చా కార్యక్రమాలు

 

           మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం  కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు  పి.రఘు గారు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారు హాజరై మహబూబ్ నగర్ జిల్లా జనసైనికులకు పార్టీ బలోపేతం గురించి పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి సూచనలు సలహాలు తెలియజేసారు. జనసేన నాయకులు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కలసి కట్టుగా శ్రమిద్దామని, జనసేన ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది అన్నారు. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలు, దోపిడి రాజ్యాన్ని చేసే పార్టీలా కాకుండా యువతకు పాతికేళ్ళ భవిష్యత్తుని ఇచ్చే పార్టీగా ఉంది అన్నారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ రేచర్ల శేఖర్, రాజేష్ గౌడ్, బారిగారి రాజేందర్, జస్టిన్ బాబా, రాకేష్ రెడ్డి, కోడిగంటి సాయి, కృష్ణ, సాయి, సంతోష్, ఎడ్ల శివ, సూర్య, సందీప్, రాఘవేంద్ర, నరసింహులు, శేఖర్, రాజు, కిరణ్, రమేష్, కె.శ్రీను, లక్ష్మీ నారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way