Search
Close this search box.
Search
Close this search box.

గుంటూరు కార్పొరేషన్ 6వ వార్డు ఉపఎన్నికల్లో జనసేనపార్టీ అభ్యర్థిగా దాళ్వాయి భార్గవ్

   గుంటూరు, (జనస్వరం) : గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 6వ వార్డ్ ఉప ఎన్నికలో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థిగా దాళ్వాయి భార్గవ్ ని నామినేట్ చేయడం జరిగింది. వారికి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో B ఫారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 6వ వార్డు ఉపఎన్నికల్లో జనసేనపార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యముగా పని చేయాలని జనసేన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే అభ్యర్థి దాళ్వాయి భార్గవ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు 6వ వార్డ్ ఉప ఎన్నికలో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. వార్డులో ఉన్నటువంటి సమస్యలపై పోరాటం, అభివృద్ధి ధ్యేయంగా ప్రజల ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్రానం మార్కండేయులు, బిట్రగుంట మల్లిక, పాకనటి రమాదేవి, ఆళ్ల హరి, దార్ల మహేష్, చింత రాజు, ఉప్పు రత్తయ్య, సూదా నాగరాజు, డొంకెన మురళి కృష్ణ, పమిడి పవన్, నెల్లూరు రాజేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way