యువశక్తి సభకు అశేషంగా తరలి రండి : కుప్పం నియోజకవర్గ జనసేన నాయకులు

      శాంతిపురం, (జనస్వరం) : మన యువత మన భవిత అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తున్న యువశక్తి సభకు జన సైనికులు అశేషంగా తరలిరావాలని కుప్పం నియోజకవర్గ శాంతిపురం మండల జనసేన అధ్యక్షుడు జిఎం కిషోర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మండల జనసైనికులతో కలిసి యువశక్తి కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే యువతకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని అలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు యువత భవిష్యత్తును మార్చేందుకు యువశక్తి కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార ప్రధాన కార్యదర్శి వామనమూర్తి, జిల్లా కార్యదర్శి రామమూర్తి,జిల్లా సమీక్ష కార్యదర్శి నవీన్ కుప్పం నియోజకవర్గం మండల ప్రధాన కార్యదర్శి రవి, శ్రీకాంత్, మండల కమిటీ కార్యదర్శి సంపత్, జన సైనికులు బాలకృష్ణ మోహన్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way