చిత్తూరు జిల్లా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం

విద్యుత్

           చిత్తూరు ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం మరియు వివిధ నియోజకవర్గాల ఇంచార్జులుతో కలసి చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసనా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు జనసేన ఉద్యమం తగ్గేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చేతితో సహాయం చేసి, ఇంకో చేత్తో ప్రజల నుంచి పన్నుల రూపంలో దోచుకునే ముఖ్యమంత్రి గద్దె దిగడం ఖాయమని, ప్రజలే ఓడించే రోజులు దగ్గరలో ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్రం రావణకాష్టం అయిందని, భారంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు సుఖంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాలు అయినా సరే అభివృద్ధిలో మాత్రం శూన్యమని, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే గడియలు ఆసన్నమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way