సయ్యద్ దాదా పీర్ ఆర్థిక చేయూతనిచ్చిన చిలకం మధుసూధన్ రెడ్డి

మధుసూధన్ రెడ్డి

        ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణం 40 వ వార్డ్ తారకరామాపురంకు చెందిన మైనారిటీ కుటుంబం సయ్యద్ దాదా పీర్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఊపిరితిత్తుల సమస్య వలన చనిపోవడం జరిగింది. ఇటీవల సేవ్ ధర్మవరం కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి పర్యటిస్తుంటే దాదా పీర్ భార్య సయ్యద్ ఫక్రునిస. ఆమెకు భర్త చనిపోయి ముగ్గురు కూతుర్లు రుక్సన, ఫర్హద్, అప్సన ఉన్నారని ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వారికి జనసేన పార్టీ తరపున 15 వేల రూపాయలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చిలకం మధుసూదన్ రెడ్డి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారికి తప్పకుండా అన్ని విధాలుగా సహాయం చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, వెంకటేశ్, కోటికి రామంజి, కడపల సుధాకర్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way