కేతిరెడ్డి పెన్షన్ తీసేస్తే సొంతంగా పెన్షన్ ఇస్తూ ఆదుకుంటున్న చిలకం మధుసూదన్ రెడ్డి

మధుసూదన్ రెడ్డి

   ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 29 వ వార్డ్ సుందరయ్య నగర్ లో నిర్వహించారు.  ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఇటీవల కేతిరెడ్డి రోడ్డు వేయలేదని సుందరయ్య నగర్ కు చెందిన ఓ వృద్ధురాలు సాలమ్మ గారు సేవ్ ధర్మవరంలో కార్యక్రమంలో చిలకం మధుసూదన రెడ్డి దృష్టికి తెచ్చినందుకు ఆవిడ పెన్షన్ తీసివేయడం జరిగింది. తనకు పెన్షన్ వచ్చేదాకా ప్రతినెలా తనకు జనసేన పార్టీ తరపున నేనే పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈ నెల పెన్షన్ డబ్బులు రూ 3 వేల రూపాయలు ఇచ్చారు. అదే సుందరయ్య నగర్ కు చెందిన పుల్ల గోవింద్ గారు ఇటీవల నాయన పల్లి క్రాస్ దగ్గర యాక్సిడెంట్ కు గురవ్వడంతో వారి కుటుంబ సభ్యులకు 2 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way