Search
Close this search box.
Search
Close this search box.

మూడు సంవత్సరాలుగా దివ్యాంగులకు మొండిచెయ్యి చూపించినా ముఖ్యమంత్రి జగన్

     బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల పాలనలో దివ్యాంగులకు చేసినది ఏమి లేదు. దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క పెళ్ళికానుక హామీలు కూడా ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల పాలన అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు మహిళలపైన, లైంగిక దాడులు, అత్యాచారాలు, నిరుద్యోగులైన దివ్యాంగులకు ఉద్యోగాలు లేకుండా వ్యాపారాలు చేసుకోలేక అల్లాడిపోయిన మూడు సంవత్సరాల పాలన ఇదేనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఇదేనా అని ఎద్దేవా చేశారు. దివ్యాంగుల పెద్దవారు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తెలుసుకోండి అని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల నాయకులు కంది వెంకటరెడ్డి, కె.రాజశేఖర్ రెడ్డి, షేక్ సుభాని, దేవి రెడ్డి శ్రీనివాసరావు, గంట నాగమల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way