జగన్ రెడ్డి 420 బుద్ధులు మానుకో ! రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

● పవన్ కళ్యాణ్ కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేకే జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలనే కుట్ర చేస్తున్నాడు.

● పవన్ కళ్యాణ్ కి చిన్న హాని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది.

● పవన్ కళ్యాణ్ కి ఎటువంటి హాని జరగకుండా వీర మహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు రక్షణగా నిలుస్తాం.

● కేంద్రం తక్షణమే పవన్ కళ్యాణ్ కి Z కేటగిరి సెక్యూరిటీని కేటాయించాలి.

● రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

      అనంతపురం, (జనస్వరం) :  జనసేనపార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాయలసీమ మహిళా భాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని వైసిపి గుండాలు ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారని ఇందులో భాగంగా గతంలో కూడా విశాఖపట్నంలో జనవాని కార్యక్రమానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలని చూశారని కానీ అక్కడ విపరీతమైన జనసేన శ్రేణుల మధ్య వారి దాడులకు పప్పులు ఉడవని గ్రహించి గత మూడు రోజుల నుంచి హైదరాబాదులోని పవన్ కళ్యాణ్ గృహం నందు రిక్కీ నిర్వహించి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో గొడవలకు ప్రేరేపిస్తూ దాడులు చేయాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ కి ఎటువంటి హాని జరగకుండా వీర మహిళలు, జనసేన నాయకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ కి రక్షణగా నిలుస్తామని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీరమహిల శైలజ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way