ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి : జనసేన నాయకులు సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ

      అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గము అరకు వేలి మండలం పెద్దలబ్బుడు పంచాయతీ పరిధిలో గల గరడగూడ గ్రామంలో జనసేనపార్టీ నాయకులు సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ, కొర్ర బంగార్రాజు ఆధ్వర్యంలో శనివారం ఆయా గ్రామాల్లో ఏడు గంటల సమయంలో సందర్శించి, ముందుగాను గ్రామ ప్రజలతో సమావేశమై సమస్య పట్ల చర్చించారు. గ్రామంలో హౌసింగ్ బిల్లులు బాధితులకు నేటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ గృహానికి చెల్లించలేదని గిరిజనులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు నిర్మించేవ్వకుండా చేతులు దులుపుకున్నారని తెలిపారు. దీనికి స్పందించిన జనసేనపార్టీ నాయకులు సాయిబాబా మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి గిరిజనుల సమస్యలను పరిష్కారం చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా జనసేనపార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో గిరిజనులతో పాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way