ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత అమృతరావు

అమృతరావు

        గుంటూరు ( జనస్వరం ) : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ ప్రజల్లో ఉద్యమాగ్ని రగిలించి విశాఖ ఉక్కును సాధించిన కీర్తిశేషులు తమనంపల్లి అమృతరావు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయాడని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. శనివారం అమృతరావు జయంతి సందర్భంగా రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల మానస పుత్రిక అని దానిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవటమే అమృతరావుకి మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గుంటూరు నడిబొడ్డులో కోట్లాది రూపాయల విలువచేసే తన యావదాస్తిని పేదలకు పంచిన మహనీయుడు అమృతరావు అని నేరేళ్ళ సురేష్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి , నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి, గుర్రాల ఉమ, పులిగడ్డ గోపి, వడ్డె సుబ్బారావు, మల్లి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way