Logo
Date of Publish : 21 October 2023, 8:45 pm
Editor : Sake Naresh

ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత అమృతరావు

        గుంటూరు ( జనస్వరం ) : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ ప్రజల్లో ఉద్యమాగ్ని రగిలించి విశాఖ ఉక్కును సాధించిన కీర్తిశేషులు తమనంపల్లి అమృతరావు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయాడని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. శనివారం అమృతరావు జయంతి సందర్భంగా రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల మానస పుత్రిక అని దానిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవటమే అమృతరావుకి మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గుంటూరు నడిబొడ్డులో కోట్లాది రూపాయల విలువచేసే తన యావదాస్తిని పేదలకు పంచిన మహనీయుడు అమృతరావు అని నేరేళ్ళ సురేష్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి , నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి, గుర్రాల ఉమ, పులిగడ్డ గోపి, వడ్డె సుబ్బారావు, మల్లి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com