Search
Close this search box.
Search
Close this search box.

వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన ఆలూరు జనసేన నాయకులు

   ఆలూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నెకల్ వెంకప్ప గారి ఆధ్వర్యంలో దేవనకొండ మండలంలోని కరిడికొండ, అలరుదిన్నె, కొత్తపేట గ్రామాల్లో వరి పంట, ఉల్లి పంట, మిరప పంట పొలాలను జనసేన పార్టీ స్థానిక మండల, గ్రామ నాయకులు నందు, రామ లక్ష్మణ్, ఆంథోని గార్లు పరిశీలించడం జరిగింది. అలాగే వారు రైతులను కలిసి నష్టపోయిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని, గత నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల్లో నష్టపోయిన ఒక ఎకరానికి సుమారు 15 వేల నుంచి 25 వేల వరకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way