డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అరకు జనసేన నాయకులు

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గం డుంబ్రిగుడా మండలం ఈరోజు జనసేనపార్టీ ఆధ్వర్యంలో డుంబ్రిగుడా మండలాధ్యక్షుడు రాజు రామకృష్ణ చిన్న బాబు అద్వర్యం లో ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను, స్మరించుకొంటు వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడనీ, ఆయన “భారతరత్న” భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాల నెరవేర్పు కై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో అరకు వేలి మండల నాయకులు రామకృష్ణ డుంబ్రిగుడా మండల నాయకులు రామదాసు, అశోక్ చినబాబు జనసేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way