ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా – ఏడుస్తుంటే..ప్రకటనలా? : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

    అమరావతి, (జనస్వరం) : ఏపీ ప్రభుత్వం పైన మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక అంటూ పత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇచ్చింది. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ జారీ చేసింది. నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుక ఇస్తామని అందులో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల వారీగానూ వివరించింది. ఈ ప్రకటనలు జారీ పైన జనసేన అధినేత స్పందించారు. వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే..ప్రజల ఇళ్లు- వాకిల్లు, పశునష్టం, పచ్చటి- పొలాల్లో ఇసుక మేట వేసి ఏడుస్తుంటే, ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అని నిలదీసారు. అయితే ప్రభుత్వము ఈ ప్రకటనల్లో బ్లాక్ మార్కెంట్ జరగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రకటన ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇంత భారీ ప్రకటనలు ఇవ్వటం పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో పెట్రో ఉత్పత్తుల ధరలు..వ్యాట్ తగ్గింపు అంశంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించటం పైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way