పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన వైస్సార్సీపీ నాయకులు

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారి ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అడబాల వీర్రాజు, దాసం కొండబాబు మరియు తాటిపర్తి జనసైనికుల కృషి ఫలితంగా వైసిపి నాయకులు అమరాది రామకృష్ణ (వల్లీ) గారు మరియు ఆయన అనుచరగణం ఇంచుమించు 50 మందికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ వారి ఆశయాలు, ఆదర్శాలుకు అనుకూలంగా మేము సైతం మీ బాటలో అడుగు వేస్తాము అని తాటిపర్తి నాయకులు, యువకులు ముందుకు రావడం జరిగింది. ఇలాగే మన జనసైనికులు ప్రతి ఒక్కరు పనిచేసి జనసేన పార్టీకి బలంగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మొగిలి అప్పారావు, అడబాల వీర్రాజు, దాసం కొండబాబు, అడపా నూకరాజు, రంపం సత్తిబాబు, అమరాది వల్లీ రామకృష్ణ, రత్నం సత్తిబాబు, గారపాటి చంటి బాబు, గోకరకొండ బుజ్జి, నక్క ప్రసాదరావు, దాసం మణికంఠ, అమలకంటి శ్రీను, ఆకుల వెంకన్న, పంతం స్వామి, పంతం విష్ణు, మాదేపల్లి కృష్ణ, గారపాటి సత్తి బాబు, ఎస్. అప్పారావు, కోన రాధాకృష్ణ, కరెడ్ల పెద్ద కాపు, అడబాలా శివ, మొయిళ్ళ సత్యనారాయణ, ఎర్ర సతీష్, గొల్లపల్లి కృష్ణార్జున, మొయిళ్ళ శివగంగ, నక్క నారాయణ మూర్తి, కొవ్వూరి మణికంఠ, మరియు తాటిపర్తి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way