వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి. జనసేనపార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ

కృష్ణా జిల్లా

     అవనిగడ్డ, (జనస్వరం) : అవనిగడ్డలో గల కోర్టు సెంటర్లో శనివారం కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు ఆధ్యర్యంలో బండ్రెడ్డి రాము అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు తమ నియోజకవర్గాలలో నెలకొన్న పరిస్థితులను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాము విలేకర్లతో మాట్లాడుతూ, అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు ఒకరిని మరొకరు విమర్శించుకుంటూ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. మాదక ద్రవ్యాలపై రెండు పార్టీలు కూడపలుక్కుని విషయం బయటకు రాకుండా గొడవలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కొద్ధి రోజుల నుంచి రెండు పార్టీల విమర్శలు మీడియాలో చూస్తుంటే సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన రాక్షస పాలనను తలపించేలా వున్నదని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు తక్షణమే రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. శాసన సభ్యులు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలు విస్మరిస్తే, ప్రజలే బుద్ధి చెబుతారని రాము అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way