గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

   హైదరాబాద్, (జనస్వరం) : గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం, భారీ వర్షాల వల్ల ఉత్తరాంధ్ర నుంచి, కృష్ణా జిల్లా వరకూ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి… వేలాది ఇళ్ళల్లోకి నీళ్ళు ప్రవేశించి జనజీవనం అస్తవ్యస్తం కావడం బాధాకరమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం దెబ్బ తినడంతో ప్రజలు అంధకారంలో ఉన్నారని అన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని సంబంధిత శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జనసేన నాయకులు, శ్రేణులు తమ పరిధిలో బాధితులకు సహాయపడాలని కోరారు.
ప్రకృతి విపత్తులకు నష్టపోయే వర్గం రైతాంగమే :
“అప్పులు చేసి, కాయకష్టంతో సాగు చేసే రైతులు తుపాన్లు, భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బ తింటున్నారు. గులాబ్ తుపాను మూలంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఎక్కువ మేర వరి దెబ్బతిందని, పంట నష్ట పరిహారం లెక్కించడంలో ప్రభుత్వం అనుసరించే విధానాలు మారితేనే రైతులకు మేలు జరుగుతుంది. నామ మాత్రపు సాయంతో సరిపెడితే ప్రయోజనం ఉండదు. నివర్ తుపాను సమయంలో పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు, కౌలు రైతుల ఆవేదన స్వయంగా తెలుసుకున్నాను. ఎకరానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పరిహారం ఇస్తేనే రైతులు కోలుకోగలరు. ఈ దిశగా ఇప్పుడైనా ఆలోచన చేయాలి” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way