నర్సీపట్నం నియోజకవర్గములో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

నర్సీపట్నం

     నర్సీపట్నం, (జనస్వరం) :  నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం సి.హెచ్ నాగ పురం గ్రామంలో వైసిపి, టిడిపి పార్టీల నుండి దాదాపుగా 100 మంది కార్యకర్తలు నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ రాజనా వీర సూర్యచంద్ర గారి సమక్షంలో సి.హెచ్ నాగపురం వైసీపీ నాయకుడు శివ గారితో సహా పలువురు  జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా  శివ గారు మాట్లాడుతూ నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వైసిపి పార్టీని భవిష్యత్తుపై ఆలోచన లేకుండా విచ్చలవిడిగా ప్రజా ధనం దుర్వినియోగంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, మాకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలని ఉపాధి కల్పన తో కూడిన సమాజ శ్రేయస్సు కోసం జనసేన పార్టీలో సిద్ధాంతాలు నచ్చి  చేరడం  జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజనా వీర సూర్యచంద్ర గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం మంచి శుభపరిణామము అని అన్నారు.  వైసిపి ప్రభుత్వముపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతలును ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. అలాగే రాబోయే ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరే విధంగా గ్రామాలలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు జనసేన అభిమానులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way