హైదరాబాదులో ” సమస్య మీది – సమరం మాది ” నినాదంతో ప్రజల్లోకి జనసేన నాయకులు

తెలంగాణ

                 తెలంగాణ ( జనస్వరం ) : కూకట్ పల్లి నియోజకవర్గంలోని నాళాలలో వివిధ రకమైన కెమికల్స్ మరియు వ్యర్థాలు కలుస్తున్నాయి. వాటి వల్ల అక్కడ ఉండే ప్రజలు తీవ్ర అనారోగ్యంకి గురువుతున్నారని జనసేన పార్టీ నాయకులకి సమాచారం అందింది. అందులో భాగంగా శ్రీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఆ డివిజన్ లో నాళాలు దగ్గరికి వెళ్లి పరిస్థితిని గమనించి త్వరలో వీటికి సంబంధించిన  అధికారులకి సమాచారం అందించి ఆ సమస్యకు  పరిష్కరిస్తాం అని అక్కడ ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రజల కష్టాల తరుపున పోరాడుతుందని చెప్పారు. అలాగే భవిష్యత్తులో పార్టీ బలోపేతం దిశగా పని చేస్తామని, అందుకు త్వరలోనే కార్యచారణ రూపొందిస్తున్నామని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, సూర్య, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way