పేద మహిళ గత 15 యేళ్ళు గా నివసిస్తున్న తన గుడిసెను  అక్రమంగా తొలగించిన వై‌సి‌పి నాయకులు

మహిళ

           విజయనగరం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, గలావల్లి గ్రామానికి చెందిన బోని సత్తెమ్మ అనే ఓ పేదింటి మహిళ గత 15 యేళ్ళు గా నివసిస్తున్న తన గుడిసెను  స్థానిక వైసిపి నాయకులు, అధికారులతో  కలసి ఈ స్థలం ప్రభుత్వానిది అని కారణం చూపి, అతి దారుణంగా కూల్చేసి తనని తన కూతుర్ని, ఇద్దరు మనవరాల్లను కూడా రోడ్డున పడేసారు. ఇదేం దౌర్జన్యం అని బోని సత్తెమ్మ నిలదీస్తే, స్థానిక వైసిపి నాయకులు తను పెంచుకుంటున్న గొర్రెలను దారుణంగా చంపేసి, చేతికొచ్చిన తన వరి పంటకు నిప్పంటించి తగలబెట్టేసి తనపై భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు అని పేర్కొంది.  బోని సత్తెమ్మకి మద్దతుగా జనసేన పార్టీ నాయకులు శ్రీ బాబు పాలూరు గారు స్థానిక MRO ఆఫీస్ కి బోనె సత్తెమ్మని తీసుకెళ్లి RI మేడమ్ తో మాట్లాడి, బోని సత్తెమ్మకు తగిన న్యాయం చేసి తన ఇంటి స్థలాన్ని తనకి తిరిగి ఇప్పించేలా చర్యలు చేపట్టాలని, లేనియెడల జనసేన పార్టీ తరపున దీనిపై పెద్దఎత్తున పోరాటం తప్పదని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాబు పాలూరు గారితో పాటుగా రైతు సంఘాల రాష్ట్ర నాయకులు శ్రీ వాసిరెడ్డి లక్షుం నాయుడు గారు, CPM నాయకులు శ్రీ మన్మధరావు గారు, జనసేన నాయకులు బంకురు పోలినాయుడు గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way