జనసేనాని ఆరోగ్యం కుదుటపడాలని శ్రీ ఆంజనేయస్వామికి కొలసాని లక్ష్మీ దంపతులచే ప్రత్యేక పూజలు

          జనంమెచ్చిన నాయకుడు… జనహృదయనేత.. జనసేనాధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కరోనా మహమ్మారి బారినుంచి త్వరగా కోలుకోవాలని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని నూతలపాడు గ్రామానికి చెందిన జనసేనపార్టీ నాయకులు శ్రీమతి కొలసాని లక్ష్మీ, శ్రీనివాసరావులు స్థానిక శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ గారి పేరిట ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేయించారు. అంజనీమాత సుతునికి ఆపదలు రాకుండా చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించి ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని వాయుపుత్రుని వారు ప్రార్థించారు. ఈసందర్భంగా శ్రీ స్వామి వారికి ప్రత్యేక ఆకు పూజలు, 11 కొబ్బరి కాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కొలసాని లక్ష్మీ శ్రీనివాసరావు దంపతులతో సహా నూతలపాడు జనసైనికులు, గ్రామస్థులు అందరూ శ్రీ ఆంజనేయ స్వామి వారిని, సకల దేవతలను వారు మొక్కుకున్నారు. ఈకార్యక్రమంలో మెగాఫ్యామిలీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వెంకటేష్, వంశీకృష్ణ, నాగపవన్ కుమార్, రాజేష్ తదితరులతో పాటు పలువురు మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way