శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరుపున మహిళా దినోత్సవ వేడుకలు

                    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి వినుత కోటా గారి అధ్వర్యంలో పట్టణంలోని స్వామి రిలాక్స్ ప్యారడైజ్ హాల్ నందు జిల్లా లోని పలు రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖ స్త్రీ మూర్తులను ఆహ్వానించి వారిని సత్కరించి గౌరవించడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, లాయర్లు, డాక్టర్లు, పోలీసులు మరియు రాజకీయంగా సేవలు అందిస్తున్న వారు, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజల కోసం సేవలు అందించిన మునిసిపల్ సిబ్బందిని ఆహ్వానించి వారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు వారి ఆలోచనలు, వారి భావాలను పంచుకోవడం జరిగింది. మహిళలను వెన్నుండి ప్రోస్తహిస్తే వారు సాధించలేని విజయాలు ఏవి వుండవని తెలియజేశారు. ఈ సృష్టికర్థ అయినటువంటి మాతృ మూర్తిని గౌరవించేలా సమాజంలో వ్యక్తుల దోరణి లో మారాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కండ్రిగ ఉమ, అమ్మ ఆశ్రమం భూలక్ష్మి, ప్రమీల గారు, వీర మహిళలు ఆకేపాటి సుభాషిణి, ఆకుల వనజ, జయంతి, శ్యామల, కోకిల, లాయర్ సంధ్య, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way