విజయనగరంలో జోరందుకున్న జనసేన ప్రచారం

      కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయనగరంలో 42 వ డివిజన్ లో జనసేన పార్టీ బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థిని, త్యాడ కనక మహాలక్ష్మి కామాక్షినగర్ లో ఇంటిఇంటికీ ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆదరణ బాగుందని, ప్రజలందరూ మార్పును కోరుకుంటున్నారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని ప్రజల్లోకి రాలేదని నా భర్త జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు గా, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడుగా, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజాల్లోనే ఉన్నామని, ఖచ్చితంగా ప్రజల ఆదరణ మాకు ఉంటుందని అన్నారు. జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణరావు(బాలు) మాట్లాడుతూ ప్రచారంలో ప్రజలందరూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, సమయానికి పెన్షన్లు రావట్లేదని, ఇళ్ళు నిర్మాణం చేసుకుందామంటే ఇసుక దొరకట్లేదని, కాలువల నిర్మాణం, రోడ్లు సగం సగం పనులతో ప్రజలకు అవస్థలపాలు చేస్తున్నారని, కనీసం గత ఆరు మాసాలుగా వీధుల్లో బ్లీచింగ్ కూడా వేయట్లేదని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే జనసేన ,బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way