భీమవరంలో ఉన్న సమస్యలను తీర్చాలని అధికారులకు వినతి పత్రాన్ని అందించిన జనసేన నాయకులు

                    భీమవరం పట్టణం లోని 18,19వ వార్డులలో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ, ప్రజల అనారోగ్యానికి కారణమవుతోందని అధికారులు పట్టించుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 18,19 వార్డు ప్రజలతో కలిసి అధికారులకు వినతిపత్రం అందించారు. గతంలో చేపట్టిన రోడ్డునిర్మాణం ఎత్తుగా ఉండడం, దానికి అనుగుణంగా డ్రెయినేజి నిర్మాణం లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోతుందన్నారు. దీంతో దోమలు,కీటకాలు పెరిగిపోతున్నాయని, అలాగే నిలవవున్న ఈ మురుగునీరు మంచినీటి పైపులలో కలుస్తుండడంతో మంచినీరు తాగడానికి పనికిరాకుండా పోతోందని, దీంతో ఈ వార్డులలోని ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way