తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎం‌పి‌డి‌ఓ కు వినతి పత్రాన్ని అందించిన కుప్పం జనసేన నాయకులు

             చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో త్రాగునీటి సమస్య ముఖ్యమైనది. ఇందుకు కారణంగా మండలంలోని 17 పంచాయతీలలో గల గ్రామాలలో ఎక్కడైతే నీటి సమస్య ఉందో అదేవిధంగా వాటర్ ట్యాంక్ మరమ్మత్తులు జరపాలని ప్రతి రెండు ఇళ్లకు ఒక కుళాయి అమర్చాలని స్థానిక జనసేన నాయకులు ఎం‌పి‌డి‌ఓ కు వినతి పత్రాన్ని అందించారు. పాడుబడ్డ బోర్లను మరమ్మత్తులు చేయించాలని కోరారు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయినా త్రాగునీటి సమస్యను పరిష్కరించకపోవడం దారుణ౦ అన్నారు. వీలయినంత త్వరగా సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ధర్నాకు దిగుతామని జనసేన నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరీష్, రామకుప్పం మండలం జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way